Header Banner

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

  Wed Jun 04, 2025 10:18        Politics

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతికి సంబంధించి భవిష్యత్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో అమరావతి అభివృద్ధి కోసం రెండో దశలో 40 నుంచి 45 వేల వేల ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తోంది. ఈ భూమిని భూ సమీకరణ ద్వారా, భూసేకరణ ద్వారా తీసుకోవాలా అనే అంశాలను పరిశీస్తోంది. స్థానిక ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ప్రజల అభిప్రాయాలను తీసుకునే పనిలో ఉన్నారు. అమరావతిలో కూడా శంషాబాద్ ఎయిర్‌పోర్టు తరహాలో అంతర్జాతీయ విమానాశ్రయం, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం 5 వేల ఎకరాలు అవసరం అవుతాయన్నారు మంత్రి నారాయణ. పెట్టుబడిదారులు అమరావతికి రావాలంటే 5 వేల ఎకరాలతో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఉండాలన్నారు. స్మార్ట్ ఇండస్ట్రీస్ కోసం 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,500 ఎకరాలు కేటాయించాల్సి ఉంటుందన్నారు.

హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్టు విషయంలో చంద్రబాబు అప్పట్లో దూరదృష్టితో ఆలోచించారన్నారు. అప్పట్లోనే శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అన్ని వేల ఎకరాలు ఎందుకు? బేగంపేటలో ఉన్న ఎయిర్‌పోర్టు చాలదా? అని విమర్శించారన్నారు. అప్పుడు కనుక శంషాబాద్ ఎయిర్‌పోర్టు నిర్మించకపోతే ఇప్పుడు అక్కడికి వస్తున్న విమానాల్లో పది శాతం కూడా బేగంపేటలో దిగలేవని వ్యాఖ్యానించారు. పెట్టుబడులు రావాలంటే అంతర్జాతీయ విమానాలు దిగేలా ఉండాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అందుకే అమరావతిలోనూ 5,000 ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించాలని ప్లాన్ చేశామన్నారు.


ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!


అమరావతి పరిధిలో ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో 26,000 ఎకరాలు, తాడికొండ నియోజకవర్గంలోని మూడు గ్రామాల్లో 12,000 ఎకరాలు భూసమీకరణ ద్వారా సేకరించడానికి రైతులు ముందుకు వచ్చారన్నారు మంత్రి నారాయణ. ఈ రెండో విడతలో రాజధాని కోసం భూములు ఇచ్చే రైతులకు మూడేళల్లో మూడేళ్లలో అభివృద్ధి చేసిన స్థలాలు అప్పగిస్తామన్నారు. రాజధానిలో విద్య, వైద్య సంస్థలకు భూముల రిజిస్ట్రేషన్ ఫీజులో మినహాయింపు ఇవ్వాలని సీఆర్డీఏ నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే మూడేళ్లలో అమరావతి కోర్ క్యాపిటల్ ప్రాంతంలోని అన్ని నిర్మాణాలు పూర్తి చేస్తామన్నారు. కోర్ క్యాపిటల్ ఏరియాలో రూ.3,673 కోట్ల అంచనా వ్యయంతో ఐదు అడ్మినిస్ట్రేటివ్ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు చేసిన విషయాన్ని తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తే ఏడాదికి రెండు మూడు పెద్ద ఈవెంట్లు జరుగుతాయని.. ఇలా దేశ, విదేశాల నుంచి క్రీడాకారులు, ఫ్యాన్స్ వస్తారన్నారు.. అప్పుడు హోటల్స్ కూడా ఏర్పాటవుతాయన్నారు. ఇలా ప్రభుత్వానికి GST పెరుగుతుంది అన్నారు. భూసమీకరణలో తీసుకున్న భూమిలో రైతులకు స్థలాలు కేటాయించగా సీఆర్డీఏకు 25 శాతమే మిగులుతాయన్నారు. ఎయిర్‌పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రీస్, స్పోర్ట్స్ సిటీలకు 10,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు.

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APDevelopment #InternationalAirport #NewAirportAP #5000AcresProject #BrightFuture #InfrastructureBoost